పచ్చి గడ్డి, ఎండు గడ్డి ఉపయోగించి బయో డైనమిక్ కంపోస్టును తయారు చేయవచ్చును. కుప్ప తయారు చేయుపద్దతి ముందుగా 5x2.5 మీ. వైశాల్యముగల మెరక ప్రదేశమును ఎంచుకోవాలి. మొదటి వరుసలో 20 సెం.మీ. ఎత్తులో ఎండు గడ్డిని, రెండవ వరుసలో 20సెం.మీ ఎత్తులో పచ్చి గడ్డిని పరవాలి. తరువాత 100 – 150 లీటర్ల పేడనీటిని చల్లాలి. ఇదే పద్ధతిలో ఎండుగడ్డి, పచ్చి గడ్డిని, పేడనీటిని 1.5 మీ ఎత్తు వచ్చువరకు పేర్చుకుంటూ పోవాలి. బాగుగా కుళ్ళుటకు రాక్ ఫాస్పేటు (భాస్వరం), సున్నము(కాల్షియం), బూడిద (పొటాషియం)ను పొరల మధ్యలో చల్లాలి. ఒక బి.డి. సెట్ 502 నుండి 507 వరకు పొరల మధ్యలో 5 – 7 అడుగుల దూరంలో పెట్టాలి. ఈ కుప్పను మట్టి, పేడ కలిపిన మిశ్రమముతో మెత్తాలి. కాల వ్యవది : 8 నుండి 12 వారముల వ్యవధిలో తయారగును. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.