చింత సుమారు 24 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిపై 10-20 కొమ్మలు ఉండి చివర తొడిమలు, పూలు అక్కడక్కడ వెదజల్లినట్లుగా ఉంటాయి. కాయలు నవంబరు, డిసెంబరులో పడుతాయి. బాటల పక్కన ఖాళీ స్దలాలలో అనువైన చెట్టు. కలప గట్టిది కాబట్టి పనిముట్లు, రోకళ్ళు, గానుగలు తయారుచేస్తారు. నేలలు నిస్తారమైన తక్కువ తేమ గల ప్రాంతాల్లో పెరుగగలదు. చెట్ల వేర్లు లోతుగా ప్రక్కకు విస్తరించడం వలన నేల గుల్లబారి, భూసారము పెరుగుతుంది. రకం పి.కే.యం – 1 రకం అంట్లు వేయాలి. దీని వలన 4-5 సంవత్సరాలలో చెట్లు పూతకు వచ్చి దిగుబడి మొదలవుతుంది. చెట్టుకు 30-40 కిలోల కాయ దిగుబదినిస్తుంది. విత్తన మోతాదు (ఎకరాకు) విత్తనాలను జనవరి – ఫెబ్రవరిలో సేకరించి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కిలో బరువులో 2000 గిజలుంటాయి. విత్తనాలను నీటిలో 24 గంటలు నానబెట్టి సంచుల్లో నాటాలి. వారం రోజులలో విత్తనం మొలకెత్తుతుంది. జూలై నేలలో నాటటానికి సిద్ధంగా ఉంటాయి. విత్తన శుద్ధి ఎకరానికి 40-50 మొక్కలు వరకు నటుకోవచ్చు. విత్తే దూరం 10 x 10 మీ. లేదా 9 x 9 మీ. ఎడంలో నాటుకోవాలి. ఒక సంవత్సరం వయస్సు కలిగిన మొక్కలను వర్షాకాలంలో నాటుకోవాలి. అంతర పంటలు మొదటి 4-5 సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు లాభసాటిగా పెంచుకోవచ్చు. చెట్లు బాగా పెరిగాక పశుగ్రాస పైర్లను పెంచుకోవచ్చును. అంతర కృషి మొక్కలు పెట్టె ముందు నేలను లోతుగా దున్నాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దున్నినట్లయితే కలుపు నివారణే కాక వర్షపు నీరు భూమిలో నిలువ ఉండి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. నీటి యాజమాన్యం నీరువున్న ప్రదేశాలలో మొదటి వేసవి కాలంలో మొక్కలకు 3 వారాలకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి. దిగుబడి 10 సంవత్సరాలు పెంచిన చెట్లకు సుమారు 20-30 కిలోల పచ్చికాయలు లభిస్తాయి. 15 సంవత్సరాల చెట్లకు 30-40 కిలోల కాయలు లభిస్తాయి. ఇలా సుమారు 80 సంవత్సరాల వరకు ప్రతి 2 సంవత్సరాల కొకసారి దిగుబడి వస్తుంది. దీనిలో 55 శాతం గుజ్జు, 34 శాతం గింజలు ఉంటాయి. గింజలు పిండి పదార్దాలకు చౌక ప్రత్యామ్నాయం. కొన్ని ప్రాంతాలలో చింత చిగురును అమ్మి లాభాలు సంపాదిస్తారు. ఆధారం: వ్యవసాయ పంచాంగం